కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపాలిటీ, పర్యావరణ శాఖ మంత్రి
- May 02, 2021
దోహా: మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు పురపాలక, పర్యావరణ శాఖ మంత్రి అబ్ధుల్లా బిన్ అబ్ధుల్లాజిజ్ బిన్ టర్కీ అల్. ఈ సందర్భంగా ఆయన కార్మికుల సేవలను కొనియాడారు. ఖతార్ పురోభివృద్ధిలో తమ మంత్రిత్వ శాఖలోని కార్మికుల కృషి అభినందనీయమని అన్నారు. మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్ సమయంలో మున్సిపాలిటీ కార్మికులు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని ప్రశంసించారు. కోవిడ్ ను సమర్ధవంతంగా అరికట్టడంలో మరింత అంకిత దీక్షతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఊరెడూ అనే సంస్థ సౌజన్యంతో మున్సిపాలిటీ, పర్యావరణ శాఖలోని పలువురు ఉత్తమ కార్మికులను మంత్రి సత్కరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







