'రాధేశ్యామ్' కూడా ఓటీటీలో చూడాలసిందేనా?!

- May 03, 2021 , by Maagulf
\'రాధేశ్యామ్\' కూడా ఓటీటీలో చూడాలసిందేనా?!

ఒక‌ప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొంద‌రికి తెలియ‌ని ప‌రిస్థితి. కాని ఇప్పుడు క‌రోనా ప‌రిస్థితుల‌లో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మ‌క్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెర‌వ‌క‌పోవ‌డం, ఓపెన్ చేసిన క‌రోనా వ‌ల‌న వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఓటీటీనే బెస్ట్ ఆప్ష‌న్ అనుకుంటున్నారు. ఇక నిర్మాత‌లు సైతం రిలీజ్‌కు సిద్దంగా ఉన్న సినిమాల‌ను పెండింగ్ పెట్టడం ఇష్టం లేక ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు.

ప్ర‌భాస్- పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన రాధే శ్యామ్ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని ప్ర‌చారం నడుస్తుంది. జూలై 30న రాధే శ్యామ్ మూవీని థియేట‌ర్‌లో విడుద‌ల చేస్తాం అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తే ఆ స‌మ‌యానికి థియేట‌ర్స్ తెర‌వ‌డం క‌ష్టంగానే అనిపిస్తుంది. ఈ క్ర‌మంలో ‘రాధేశ్యామ్’ సినిమాను పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా, పే పర్ వ్యూ విధానంతో.. సల్మాన్ ఖాన్ రాధే: ది మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమాను మే 13న విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com