జులై వరకూ వ్యాక్సిన్లకు కొరతే..సీరం చీఫ్
- May 03, 2021
న్యూఢిల్లీ: అసలే వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాలు, ప్రజలకు మరో బ్యాడ్న్యూస్ చెప్పారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా. వ్యాక్సిన్ల కొరత జులై వరకూ తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఈ కొరతకు బాధ్యత తమ కంపెనీది కాదు ప్రభుత్వానిదే అని కూడా అదర్ మరో బాంబు పేల్చారు. జనవరిలో పరిస్థితి చూసి ఇక ఇండియాలో కరోనా పనైపోయిందని అందరూ అనుకున్నారు. సెకండ్ వేవ్ను అంచనా వేయడంలో అధికార యంత్రాంగం దారుణంగా విఫలమైంది. రాజకీయ నాయకులు, విమర్శకులు వ్యాక్సిన్ కొరతకు మా కంపెనీని బదనాం చేశారు. కానీ దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కంపెనీ అస్సలు కాదు అని అదర్ తేల్చి చెప్పారు.
నన్ను బలిపశువును చేయాలని చూశారు. గతంలో వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచలేదు. తగిన ఆర్డర్లు లేవు కాబట్టి తయారీ పెంచలేదు. ఏడాదికి 100 కోట్ల డోసులు అవసరమవుతాయని మేము అనుకోలేదు అని పూనావాలా స్పష్టం చేశారు. ప్రస్తుతం పుణెలోని సీరంలో నెలకు 6-7 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు తయారువుతున్నాయి. దీనిని మరో నెల రోజుల్లో నెలకు 10 కోట్లకు పెంచనున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదర్ చెప్పారు.
వ్యాక్సిన్ కోసం తనకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే ఇండియా వదిలి లండన్ వచ్చేసినట్లు ఆయన చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఇండియా వస్తానని, వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తానని తెలిపారు. ప్రస్తుతం అయితే కొవిషీల్డ్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







