మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి

- March 03, 2016 , by Maagulf
మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి

 లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి అర్పించి సంతాపం తెలిపారు. సంగ్మా నేడు ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. సంగ్మా సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న సీఎం పీఏ సంగ్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా విజయవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు ఈశాన్య రాష్ర్టాల ప్రజల గొంతుకగా దేశవ్యాప్తంగా సంగ్మాకు పేరుందని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంగ్మా ఇచ్చిన నైతిక మద్దతు ఎన్నడూ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com