విశాల్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!
- May 06, 2021చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 31వ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ మేకర్ టి.పి. శర్వానన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'దేవి -2' ఫేమ్ డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం డింపుల్ తెలుగులో రవితేజ సరసన 'ఖిలాడీ' చిత్రంలో చేస్తోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతుండగా, బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'ఎనిమి' సినిమాలో ఆర్యతో కలిసి విశాల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలానే మిస్కిన్ దర్శకత్వంలో 'తుప్పరివాలన్ -2' చేయాల్సి ఉన్నా, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. దాంతో శరవేగంగా ఈ 31వ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ నెలలో విడుదల చేయాలని విశాల్ భావిస్తున్నాడు. దీనికి అతనే నిర్మాత కూడా...!
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్