విశాల్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!
- May 06, 2021
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 31వ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ మేకర్ టి.పి. శర్వానన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'దేవి -2' ఫేమ్ డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం డింపుల్ తెలుగులో రవితేజ సరసన 'ఖిలాడీ' చిత్రంలో చేస్తోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతుండగా, బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'ఎనిమి' సినిమాలో ఆర్యతో కలిసి విశాల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలానే మిస్కిన్ దర్శకత్వంలో 'తుప్పరివాలన్ -2' చేయాల్సి ఉన్నా, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. దాంతో శరవేగంగా ఈ 31వ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ నెలలో విడుదల చేయాలని విశాల్ భావిస్తున్నాడు. దీనికి అతనే నిర్మాత కూడా...!
తాజా వార్తలు
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్







