కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

- May 06, 2021 , by Maagulf
కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్‌ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.స్వల్ప లక్షణాలున్నా,లక్షణాలు లేకున్నా ఇంట్లోనే ఉండాలని పేర్కొంది.మూడు పొరల మాస్కు ధరించాలని సూచించింది. వీలైనంత వరకు ఎక్కువగా నీరు, జ్యూస్లు తాగాలని పేర్కొంది.అంతేకాకుండా బీపీ, షుగర్ ఉన్న వాళ్లు వైద్యుల సలహా తీసుకోవాలని,ఆక్సిజన్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంది. ఇక ఐసోలేషన్ నుంచి 10 రోజుల తర్వాత బయటకురావాలని పేర్కొంది.చివరి 3 రోజుల్లో జ్వరం రాకపోతే టెస్టు అవసరం లేదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com