తర్వాతి విడతలో మూడో డోసు వేయనున్నట్లు బహ్రెయిన్ ప్రకటన
- May 08, 2021
బహ్రెయిన్: కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించిన బహ్రెయిన్ లేటెస్ట్ గా...మూడో డోస్ కు సంబంధించిన ప్రణాళికను కూడా వెల్లడించింది. తర్వాతి విడత వ్యాక్సినేషన్ లో భాగంగా మూడో డోస్ కూడా అందించనున్నట్లు జాతీయ వైద్య బృందం ప్రకటించింది. మూడో డోస్ తో నిర్ణీత వర్గాలు సంపూర్ణ ప్రయోజనాలను పొందుతారని అభిప్రాయపడింది. 60 ఏళ్లు అంతకు మించి వయసున్న వారు..ఊబకాయులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి తొలి డోసు వేసుకున్న 6 నెలల తర్వాత మూడో డోస్ వేయనున్నట్లు జాతీయ వైద్య బృందం అధికారులు తెలిపారు. మిగిలిన పౌరులు, ప్రవాసీయులకు తొలి డోసు తర్వాత 12 నెలలకు మూడో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మూడో డోసు పొందాలనుకునే వారు మెడికల్ ప్రోటోకాల్ అనుసరించి బీఅవేర్ యాప్ లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







