తర్వాతి విడతలో మూడో డోసు వేయనున్నట్లు బహ్రెయిన్ ప్రకటన

- May 08, 2021 , by Maagulf
తర్వాతి విడతలో మూడో డోసు వేయనున్నట్లు బహ్రెయిన్ ప్రకటన

బహ్రెయిన్: కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించిన బహ్రెయిన్ లేటెస్ట్ గా...మూడో డోస్ కు సంబంధించిన ప్రణాళికను కూడా వెల్లడించింది. తర్వాతి విడత వ్యాక్సినేషన్ లో భాగంగా మూడో డోస్ కూడా అందించనున్నట్లు జాతీయ వైద్య బృందం ప్రకటించింది. మూడో డోస్ తో నిర్ణీత వర్గాలు సంపూర్ణ ప్రయోజనాలను పొందుతారని అభిప్రాయపడింది. 60 ఏళ్లు అంతకు మించి వయసున్న వారు..ఊబకాయులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి తొలి డోసు వేసుకున్న 6 నెలల తర్వాత మూడో డోస్ వేయనున్నట్లు జాతీయ వైద్య బృందం అధికారులు తెలిపారు. మిగిలిన పౌరులు, ప్రవాసీయులకు తొలి డోసు తర్వాత 12 నెలలకు మూడో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మూడో డోసు పొందాలనుకునే వారు మెడికల్ ప్రోటోకాల్ అనుసరించి బీఅవేర్ యాప్ లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com