ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తత...
- May 11, 2021
గాజా సిటీ: మళ్లీ ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మద్య ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి.పాలస్తీనాలోని గాజాపట్టీ ప్రాంతం నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్పై రాకెట్ దాడులు చేశారు.పదుల సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయిల్ వైపు దూసుకొచ్చాయి.ఈ దాడిలో ఇజ్రాయిల్లోని కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి.దీనికి ప్రతీకగా ఇజ్రాయిల్ కి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాలతో దాడులు చేసింది.ఈ దాడిలో 24 మంది వరకు మరణించి ఉంటారని ఇజ్రాయిల్ తెలియజేసింది.దీంతో రెండు దేశాల మద్య యుద్దవాతావరణం నెలకొన్నది.1967లో ఇజ్రాయిల్లోని తూర్పు జెరూసలెం, పవిత్ర స్థలాలను ఇజ్రాయిల్ స్వాదీనం చేసుకుంది.దీనికి గుర్తుగా సొమవారం రోజున జెరూసలెం రోజును జరుపుకుంటారు.అయితే,ఆ రోజున దాడులు జరిగే అవకాశం ఉందని భావించిన ఇజ్రాయిల్ జెరూసలెంలోని అల్ అక్సా మసీద్ వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.ఈ బలగాలకు, ప్రార్ధనలు చేయడానికి వచ్చిన వారికి మద్య ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో అనేక మంది గాయపడ్డారు.దీనికి ప్రతీకగా హమాస్ ఉగ్రవాదులు దాడులు చేశారని ఇజ్రాయిల్ బలగాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!









