ట్రావెల్ బ్యాన్ నుంచి 5 వర్గాలకు మినహాయింపు
- May 22, 2021కువైట్ సిటీ: కువైట్ పౌరులు, వారి రక్తసంబంధీకుల విదేశీ ప్రయాణాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచనలు చేసింది. కువైట్ గుర్తింపు పొందిన కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్, అస్ట్రాజెన్కా, మోడెర్నా, జాన్సన్&జాన్సన్ లలో ఏదో ఒక వ్యాక్సిన్ను పూర్తి డోసులు తీసుకున్న వారికి మాత్రమే విదేశాలకు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే..ఈ నిబంధనల నుంచి ఐదు వర్గాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
1. ఆరోగ్య కారణాల రిత్యా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులుగా నిర్ధారిస్తూ ఆరోగ్య శాఖ సర్టిఫికెట్ పొందినవారు.
2. గర్భిణిలు.(గర్భంతో ఉన్నట్లు ఆరోగ్య శాఖ ఆమోదించిన సర్టిఫికెట్ తప్పనిసరి)
3. వ్యాక్సిన్ నుంచి మినహాయింపు పొందిన వయసువారు.
4. విదేశాల్లో చదువుకునే విద్యార్ధులు. తాము విదేశాల్లో చదువుతున్నట్లు ఆధారాలు చూపించాలి. అదే సమయంలో కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా తీసుకొని ఉండాలి.
5. కువైట్ గుర్తింపు పొందిన దౌత్యపరమైన వ్యవహారాలకు సంబంధించి ప్రయాణాలకు మినహాయింపు ఉంటుంది.
ఇదిలాఉంటే...Kuwaitmosafer యాప్ లేదా వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుంటేనే కువైట్ నుంచి వెళ్లేందుకుగానీ, కువైట్ కు వచ్చేందుకుగానీ అనుమతి ఉంటుందని కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు