పిల్లలను బిచ్చగాళ్ళగా మార్చుతున్న ముగ్గురు మహిళలకు జైలు, జరిమానా
- May 24, 2021
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు ముగ్గురు మహిళలకు 5,000 దిర్హాములు (ఒక్కొక్కరికి) జరీమానా అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నిందితులైన మహిళలు, చిన్న పిల్లల్ని బిచ్చమెత్తుకోవడం కోసం వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఓ మహిళను నైఫ్ పోలీసులు ఓ కమర్షియల్ సెంటర్ వద్ద అరెస్టు చేశారు. ఓ ఎనిమిదేళ్ళ బాలుడు సమీపంలోని రోడ్లపై బిచ్చమెత్తుకుంటుండగా, అతన్ని పోలీసులు పట్టుకుని ఆరా తీయగా, అతని తల్లి ఆచూకీ తెలిసింది. ఆమెని కూడా అరెస్టు చేశారు. ఆ మహిళ మరో ఇద్దరు అరబ్ మహిళలు, వారి చిన్నారులతో యూఏఈ చేరుకుని, బిచ్చగాళ్ళలా మారినట్లు విచారణలో గుర్తించారు. మొదటి నిందితురాలి అరెస్టుతో మిగతా ఇద్దరి ఆచూకీ దొరికింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మిగిలిన ఇద్దరు మహిళల్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







