విద్యార్ధులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన స్కూల్స్
- May 25, 2021
యూఏఈ: పన్నెండేళ్లు, అంతకుమించి వయసున్న వారికి ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో..యూఏఈలోని అన్ని స్కూల్స్ యాజమాన్యాలు తమ విద్యార్ధులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ భారీ డ్రైవ్ తో విద్యార్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయటం ద్వారా స్కూల్స్ నిర్వహణలో కొన్ని వెసులుబాట్లు పొందే అవకాశాలు లేకపోలేదు. వ్యాక్సినేషన్ పూర్తి అయితే నేరుగా తరగతులు నిర్వహించేందుకు వీలుంటుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని సూళ్ల యజమాన్యాలు తమ విద్యార్ధులకు వ్యాక్సిన్ అందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధమయ్యాయి. కొన్ని స్కూళ్ల నిర్వాహకులు..వ్యాక్సినేషన్ కోసం హోటల్స్ ను బుక్ చేసుకోగా..మరికొన్ని స్కూళ్ల నిర్వాహకులు ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి అనువైన సమయాలను ఎంపిక చేసుకొని ఆయా సమయాల్లో తమ విద్యార్ధులకు వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









