2020లో 4,15,524 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- May 25, 2021
కువైట్ సిటీ: గత ఏడాదిలో కువైట్ వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అంతర్గత మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. మొత్తం 4,15,524 ట్రాఫిక్ చలాన్లను ఇష్యూ చేసినట్లు వివరించింది. ఇందులో 2,57,636 మంది రెడ్ సిగ్నల్ జంప్ చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 64,090 మంది సీటు బెల్టులు ధరించలేదని, 6,855 మంది ర్యాష్ డ్రైవింగ్ చేయటంతో జరిమానాలు విధించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్లాస్ షేడింగ్ కొనసాగించిన మరో 57, 881 వాహనాలపై కూడా చలాన్లు వేసినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించే ప్రచారాలను చేపడుతున్నామన్నారు. అయినా కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని...అలాంటి వారిని గుర్తించి వెంటనే ఫైన్లు వేసేలా అన్ని గవర్నరేట్ల పరిధిలో తగిన ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







