2020లో 4,15,524 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- May 25, 2021
కువైట్ సిటీ: గత ఏడాదిలో కువైట్ వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అంతర్గత మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. మొత్తం 4,15,524 ట్రాఫిక్ చలాన్లను ఇష్యూ చేసినట్లు వివరించింది. ఇందులో 2,57,636 మంది రెడ్ సిగ్నల్ జంప్ చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 64,090 మంది సీటు బెల్టులు ధరించలేదని, 6,855 మంది ర్యాష్ డ్రైవింగ్ చేయటంతో జరిమానాలు విధించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్లాస్ షేడింగ్ కొనసాగించిన మరో 57, 881 వాహనాలపై కూడా చలాన్లు వేసినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించే ప్రచారాలను చేపడుతున్నామన్నారు. అయినా కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని...అలాంటి వారిని గుర్తించి వెంటనే ఫైన్లు వేసేలా అన్ని గవర్నరేట్ల పరిధిలో తగిన ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









