గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రత
- March 05, 2016
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతంలోనూ, కచ్ జిల్లాలోనూ మరింత భద్రతను పెంచింది. పాక్ భూభాగం లేదా సముద్ర మార్గం ద్వారా 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ గుజరాత్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కచ్ తీర ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో పాక్ నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చిన ఐదు మత్స్యకారుల పడవలను భారత భద్రత అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి భద్రత బలగాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి. అజిత్ దోవల్ సూచన మేరక రాష్ట్రంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఓ అధికారి చెప్పారు.గుజరాత్ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా శనివారం పోలీసు, రక్షణ, ఐబీ, పారామిలటరీ బలగాల అధికారులతో సమావేశమయ్యారు. ఇదిలావుండగా రాష్ట్రంలోకి పది మంది ఉగ్రవాదులు చొరబడినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు ఎన్ఎస్ జీ బృందాలు గుజరాత్ కు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









