గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రత
- March 05, 2016
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతంలోనూ, కచ్ జిల్లాలోనూ మరింత భద్రతను పెంచింది. పాక్ భూభాగం లేదా సముద్ర మార్గం ద్వారా 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ గుజరాత్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కచ్ తీర ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో పాక్ నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చిన ఐదు మత్స్యకారుల పడవలను భారత భద్రత అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి భద్రత బలగాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి. అజిత్ దోవల్ సూచన మేరక రాష్ట్రంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఓ అధికారి చెప్పారు.గుజరాత్ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా శనివారం పోలీసు, రక్షణ, ఐబీ, పారామిలటరీ బలగాల అధికారులతో సమావేశమయ్యారు. ఇదిలావుండగా రాష్ట్రంలోకి పది మంది ఉగ్రవాదులు చొరబడినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు ఎన్ఎస్ జీ బృందాలు గుజరాత్ కు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







