భారతీయులకు శుభవార్త
- March 06, 2016
జపాన్లో పర్యటించాలనుకునే భారతీయులకు శుభవార్త. తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకుల కోసం జపాన్ తన వీసా నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఆర్డినరీ పాస్పోర్టుపై తాత్కాలికంగా జపాన్లో ఉండేందుకు తరచూ వచ్చే భారతీయులకు వీసా నిబంధనలు సడలించింది. ఇప్పటికే భారత్ జపనీయులకు 'వీసా ఆన్ అరైవల్' ఇస్తామంటూ స్నేహహస్తం చాచిన నేపథ్యంలో జపాన్ కూడా ఈ మేరకు ముందుకొచ్చింది.ఆర్డినరీ వీసాలపై జపాన్కు వచ్చే భారతీయుల గరిష్ఠ వీసా గడువును కూడా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పెంచింది. మల్టీపుల్ ఎంట్రీ వీసాలపై పర్యాటక, వ్యాపార అవసరాల కోసం వచ్చేవారి గడువును 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచింది.
గత ఏడాది డిసెంబర్లో జపాన్ ప్రధానమంత్రి షిన్జో అబే భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా కుదుర్చుకున్న అవగాహనలో భాగంగా ఇరుదేశాలు ఈ మేరకు వీసా షరత్తులో సడలింపు తీసుకొచ్చాయి.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







