భారతీయులకు శుభవార్త

- March 06, 2016 , by Maagulf
భారతీయులకు శుభవార్త

జపాన్‌లో పర్యటించాలనుకునే భారతీయులకు శుభవార్త. తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకుల కోసం జపాన్‌ తన వీసా నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఆర్డినరీ పాస్‌పోర్టుపై తాత్కాలికంగా జపాన్‌లో ఉండేందుకు తరచూ వచ్చే భారతీయులకు వీసా నిబంధనలు సడలించింది. ఇప్పటికే భారత్‌ జపనీయులకు 'వీసా ఆన్ అరైవల్' ఇస్తామంటూ స్నేహహస్తం చాచిన నేపథ్యంలో జపాన్‌ కూడా ఈ మేరకు ముందుకొచ్చింది.ఆర్డినరీ వీసాలపై జపాన్‌కు వచ్చే భారతీయుల గరిష్ఠ వీసా గడువును కూడా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పెంచింది. మల్టీపుల్ ఎంట్రీ వీసాలపై పర్యాటక, వ్యాపార అవసరాల కోసం వచ్చేవారి గడువును 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచింది.
గత ఏడాది డిసెంబర్‌లో జపాన్ ప్రధానమంత్రి షిన్జో అబే భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా కుదుర్చుకున్న అవగాహనలో భాగంగా ఇరుదేశాలు ఈ మేరకు వీసా షరత్తులో సడలింపు తీసుకొచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com