భారతీయులకు శుభవార్త
- March 06, 2016
జపాన్లో పర్యటించాలనుకునే భారతీయులకు శుభవార్త. తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకుల కోసం జపాన్ తన వీసా నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఆర్డినరీ పాస్పోర్టుపై తాత్కాలికంగా జపాన్లో ఉండేందుకు తరచూ వచ్చే భారతీయులకు వీసా నిబంధనలు సడలించింది. ఇప్పటికే భారత్ జపనీయులకు 'వీసా ఆన్ అరైవల్' ఇస్తామంటూ స్నేహహస్తం చాచిన నేపథ్యంలో జపాన్ కూడా ఈ మేరకు ముందుకొచ్చింది.ఆర్డినరీ వీసాలపై జపాన్కు వచ్చే భారతీయుల గరిష్ఠ వీసా గడువును కూడా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పెంచింది. మల్టీపుల్ ఎంట్రీ వీసాలపై పర్యాటక, వ్యాపార అవసరాల కోసం వచ్చేవారి గడువును 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచింది.
గత ఏడాది డిసెంబర్లో జపాన్ ప్రధానమంత్రి షిన్జో అబే భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా కుదుర్చుకున్న అవగాహనలో భాగంగా ఇరుదేశాలు ఈ మేరకు వీసా షరత్తులో సడలింపు తీసుకొచ్చాయి.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









