తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు

- May 28, 2021 , by Maagulf
తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు

చెన్నై: తమిళనాడులో జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ ముగుస్తుండగా..కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుండగా.. నిత్యావసర సరుకులు, కూరగాయలను ప్రభుత్వ శాఖల ద్వారా మాత్రమే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ డెలివరీ కొనసాగుతోంది. అటు తమిళనాడులో తాజాగా 33,361 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 474 మంది మరణించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com