ప్రవాసీయుల రిక్రూట్మెంట్ పర్మిట్ తగ్గించిన ఒమన్
- May 29, 2021
ఒమన్: ఒమనైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవాసీయుల రిక్రూట్మెంట్ అనుమతులను తగ్గించింది. దేశంలో అన్ని రంగాల్లో మధ్యస్థ, ఎగువ తరగతి ఉద్యోగాలు, వృత్తులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఆర్ధిక తోడ్పాటు ప్రణాళిక మేరకు వివిధ సంస్థల్లో ప్రవాసీయుల కార్మిక శక్తి, ఒమనీయుల కార్మికశక్తిని బేరీజు వేసుకొని ఆయా సంస్థల రిక్రూట్మెంట్ పర్మిట్ ఫీజుల్లో మినహాయింపు ఉంటుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది. మంత్రివర్గ తీర్మానం 21/2021 మేరకు ప్రవాసీయుల భర్తీ శాతం మేరకు లైసెన్స్ జారీ, లైసెన్స్ రెన్యూవల్ ఫీజులో సవరణలు చేసే వెసులుబాటు ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఒమనీ కార్మిక శక్తికి తగిన ప్రాధాన్యత ఇచ్చిన సంస్థలకు 25 శాతం, ఒమనైజేషన్ రేటు మేరకు కార్మికశక్తిని భర్తీ చేసుకున్న సంస్థలకు 50 శాతం ఫీజు తగ్గింపు ఉంటుంది. ఒమనైజేషన్ శాతాన్ని బట్టి ఫీజులో తగ్గింపు సవరణలు ఉంటాయని కార్మికశాఖ వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







