ప్రభుత్వ బీమా ఉన్నా.. లేకున్నా రూ.10 లక్షల పరిహారం

- June 02, 2021 , by Maagulf
ప్రభుత్వ బీమా ఉన్నా.. లేకున్నా రూ.10 లక్షల పరిహారం

అమరావతి: కరోనాతో మృతి చెందిన వారి పిల్లలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇదివరకే తెలియ జేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా కరోనాతో అనాధలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బీమా నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రులు చని పోయిన పిల్లలకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో సవరణ చేశారు. ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిబంధనను తొలగించారు.నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం దక్కనుంది.ఈమేరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ కమిషనర్ కు.. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com