కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు అండగా రిలయన్స్ ఫ్యామిలీ...

- June 03, 2021 , by Maagulf
కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు అండగా రిలయన్స్ ఫ్యామిలీ...

ముంబై: కరోనా మహమ్మారి సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ పథకం సహాయం చేస్తుంది. COVID-19 యొక్క 2 వ వేవ్ భారతదేశంపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.ఈ సంవత్సరం వేలాది మంది తీవ్ర సంక్రమణకు గురైనందున, దేశవ్యాప్తంగా ఉన్నచాలా కుటుంబాలు ప్రియమైనవారిని, సహచరులను, స్నేహితులను కోల్పోయారు. ఈ బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి దేశ ప్రజలు కష్టపడుతున్నారు. ఇటువంటి పరీక్షా సమయాల్లో, ఒకరికొకరు నిలబడటం అత్యవసరం అని రిలయన్స్ గ్రూప్ భావించింది. మహమ్మారి సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాని ఇస్తూ, రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ పథకాన్ని ప్రకటించింది .

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ఈ పథకం గురించి మాట్లాడుతూ "ఒక రిలయన్స్ ఫ్యామిలీ" మెంబర్ గా మీ కుటుంబంలోని ఓ ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన భర్తీని మేము పూడ్చలేనప్పటికీ, ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము కట్టుబడి ఉన్నాము. రిలయన్స్ ఉద్యోగుల సంరక్షణకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుంది అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com