రేపు మహారాష్ట్రకు కేసీఆర్‌

- March 06, 2016 , by Maagulf
రేపు మహారాష్ట్రకు  కేసీఆర్‌

రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఉదయం 10.45 గంటలకు సీఎం కేసీఆర్‌, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఇరిగేషన్‌ అధికారులు ముంబైకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్‌భవన్‌కు చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. 8న ఉదయం 10.10 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు.
గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల పై ఒప్పందాలు చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com