విజయ పతాకాన్ని ఎగరవేసిన భారత్
- March 06, 2016మీర్పూర్ వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఆతిధ్య బంగ్లాదేశ్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 121 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 60 పరుగులు, విరాట్ కోహ్లీ 41 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా, భారత్ కెప్టెన్ ధోనీ ఎప్పటిలాగే సిక్స్తో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును విజేతగా నిలిపాడు. అంతకు ముందు బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్