విజయ పతాకాన్ని ఎగరవేసిన భారత్

- March 06, 2016 , by Maagulf
విజయ పతాకాన్ని ఎగరవేసిన భారత్

మీర్పూర్‌ వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఆతిధ్య బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ విధించిన 121 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 60 పరుగులు, విరాట్‌ కోహ్లీ 41 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా, భారత్‌ కెప్టెన్‌ ధోనీ ఎప్పటిలాగే సిక్స్‌తో విన్నింగ్‌ షాట్‌ కొట్టి జట్టును విజేతగా నిలిపాడు. అంతకు ముందు బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com