శివరాత్రి+మహిళా దినోత్సవం= పోతన పద్యం:-
- March 06, 2016మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగమనె సర్వమంగళ
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో
నేడు శివరాత్రి. రేపు మహిళా దినోత్సవం. రెండింటి ప్రస్తావనికి సరిపోతుంది ఈ పోతన పద్యం అనిపించింది.
"మింగే వాడు భర్త అని, మింగేది విషమని తెలిసినా, లోకకళ్యాణం కోసం పార్వతి శివుడ్ని విషం మింగేయమంది. తన మంగళసూత్రంపై తనకు ఎంత నమ్మకమో". ఇదీ ఈ పద్యభావం.
అంటే విషం మింగే విషయంలో క్లారిటీ కోసం శివుడంతటివాడు కూడా తన భార్యను సంప్రదించాడు. ఎంతటి శక్తిమంతుడికైనా స్త్రీ సంప్రదింపు లేనిదే కొన్ని పనులు చేయలేడు. పోతన అలా శివపార్వతుల ఘట్టంతో చెప్పినా, పాశ్చాత్యులు "Behind every successful man, there is a woman" అని చెప్పినా ప్రపంచమంతా స్త్రీశక్తిని ఎప్పుడో గుర్తించింది.
-సిరాశ్రీ
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!