శివరాత్రి+మహిళా దినోత్సవం= పోతన పద్యం:-
- March 06, 2016
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగమనె సర్వమంగళ
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో
నేడు శివరాత్రి. రేపు మహిళా దినోత్సవం. రెండింటి ప్రస్తావనికి సరిపోతుంది ఈ పోతన పద్యం అనిపించింది.
"మింగే వాడు భర్త అని, మింగేది విషమని తెలిసినా, లోకకళ్యాణం కోసం పార్వతి శివుడ్ని విషం మింగేయమంది. తన మంగళసూత్రంపై తనకు ఎంత నమ్మకమో". ఇదీ ఈ పద్యభావం.
అంటే విషం మింగే విషయంలో క్లారిటీ కోసం శివుడంతటివాడు కూడా తన భార్యను సంప్రదించాడు. ఎంతటి శక్తిమంతుడికైనా స్త్రీ సంప్రదింపు లేనిదే కొన్ని పనులు చేయలేడు. పోతన అలా శివపార్వతుల ఘట్టంతో చెప్పినా, పాశ్చాత్యులు "Behind every successful man, there is a woman" అని చెప్పినా ప్రపంచమంతా స్త్రీశక్తిని ఎప్పుడో గుర్తించింది.
-సిరాశ్రీ
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









