శివరాత్రి శోభతో వెలిగిపోతున్నా శైవ క్షేత్రాలు..
- March 07, 2016
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివ దర్శనం కోసం దేవాలయాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల భక్తులు నదీ స్నానాలు ఆచరించి శివలయాలను దర్శించుకుంటున్నారు. భక్తుల శివనామ స్మరణలతో దేవాలయాలు హోరెత్తుతున్నాయి. దక్షిణకాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో భక్తులు గోదావరి నదిలో స్నానాలుచేసి కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పలు శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









