శివరాత్రి శోభతో వెలిగిపోతున్నా శైవ క్షేత్రాలు..

- March 07, 2016 , by Maagulf
శివరాత్రి శోభతో వెలిగిపోతున్నా  శైవ క్షేత్రాలు..

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివ దర్శనం కోసం దేవాలయాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల భక్తులు నదీ స్నానాలు ఆచరించి శివలయాలను దర్శించుకుంటున్నారు. భక్తుల శివనామ స్మరణలతో దేవాలయాలు హోరెత్తుతున్నాయి. దక్షిణకాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో భక్తులు గోదావరి నదిలో స్నానాలుచేసి కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పలు శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com