శివరాత్రి శోభతో వెలిగిపోతున్నా శైవ క్షేత్రాలు..
- March 07, 2016
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివ దర్శనం కోసం దేవాలయాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల భక్తులు నదీ స్నానాలు ఆచరించి శివలయాలను దర్శించుకుంటున్నారు. భక్తుల శివనామ స్మరణలతో దేవాలయాలు హోరెత్తుతున్నాయి. దక్షిణకాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో భక్తులు గోదావరి నదిలో స్నానాలుచేసి కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పలు శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







