3 నుంచి 17 ఏళ్ళ వారికి సినోఫామ్ వ్యాక్సిన్ ట్రయల్స్

- June 10, 2021 , by Maagulf
3 నుంచి 17 ఏళ్ళ వారికి సినోఫామ్ వ్యాక్సిన్ ట్రయల్స్

యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, సినోఫామ్ ‘ఇమ్యూన్ బ్రిడ్జి స్టడీ’ని 3 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసువారి కోసం చేపట్టనుంది. ‘మిడిల్ ఈస్ట్’లో ఈ గ్రూపు వారికి ఈ స్టడీ చేపడుతున్న తొలి దేశంగా యూఏఈ అవతరించింది. స్టడీకి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ వయసువారు విద్యా సంస్థలకు వెళ్ళడానికి వీలుగా ఈ స్టడీ ఉపయోగపడుతుంది. వివిధ దేశాలకు చెందిన 900 మందిపై ఈ ప్రయోగాలు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి పూర్తి అనుమతి తీసుకున్నాకనే వారీ మీద వ్యాక్సిన్ పరీక్షలు చేస్తారు. ప్రతి దశకు సంబంధించిన వివరాల్ని ప్రత్యేకంగా వెల్లడిస్తారు, పిల్లల ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేస్తారు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com