వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- April 27, 2024
ఆంధ్రప్రదేశ్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మేనిఫెస్టో (YCP Manifesto 2024 ) శనివారం వచ్చేసింది. గత ఎన్నికల మేనిఫెస్టో కు దీటుగా జగన్ ఈసారి మేనిఫెస్టో ను రిలీజ్ చేసారు. మేనిఫెస్టో లో ప్రధానంగా..
* వైఎస్సార్ చేయూత 75 వేల నుంచి నాలుగు దఫాలుగా లక్షా 50 వేలకు పెంపు
* వైఎస్సార్ కాపు నేస్తం 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంపు
* వైఎస్సార్ ఈబీసీ నేస్తం: 45 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో లక్షా 5 వేలకు పెంపు
* జగనన్న అమ్మ ఒడి పథకం: 15 వేల నుంచి 17 వేలకు పెంపు
* రెండు విడుతల్లో పెన్షన్ 3500లకు పెంపు
* వైఎస్సార్ సున్నా వడ్డీలు రూ. 3లక్షలకు పెంపు
* అర్హులైన పేదలకు ఇళ్లులేని వారికి ఇళ్లు,ఇంటి స్థలం కొనసాగింపు
* వైఎస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా కొనసాగింపు
* వైఎస్సార్ రైతు భరోసా.. రూ.16 వేలు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా
* జిల్లాకో స్కిల్ డెవ్ లప్ మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ
* వాహన మిత్ర, మత్సకార భరోసా కొనసాగుతాయి
* 175 స్కిల్ హబ్ లతో యువతకు ఉపాధి
* యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3590 పోస్టులు భర్తీ
* లా నేస్తం, చేనేత నేస్తం కొనసాగుతుంది
* 2025 నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్
* ఎస్సీ,ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్
* మత్స్యకార భరోసా కింద ఐదు విడుతల్లో రూ. 50 వేలు ఇస్తామని హామీలు ఇచ్చింది. ఈ హామీల ఫై నెటిజన్లు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు..? రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి..? ఎంతమంది యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు..? రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగింది..? 130 సార్లు బటన్ నొక్కినని చెపుతున్న మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చారు..? లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రానికి , రాష్ట్ర ప్రజలు మీరు చేసింది ఏంటి..? మీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి క్రైం రేటు ఎంత పెరిగింది…? ఎన్ని దాడులు జరిగాయి..? దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన నేతను మీరు ఏంచేశారు..?
ఇప్పుడు మీరు ప్రకటించిన మేనిఫెస్టో బాగుంది.. మన రాష్ట్ర ఆదాయం ఎంత…? మీ పథకాలు అయ్యే ఖర్చు ఎంత…? రాష్ట్ర అభివృద్ధి… నీటి ప్రాజెక్ట్లు, రోడ్డులు… ఉపాధి అవకాశాలు… మాటేమిటి…? రాష్ట్ర పన్నులు తగ్గుతుందా…? మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వగలరు…? దేవాలయాలను గవర్నమెంట్ అధీనం నుండి తొలిగించాలి… ప్రజా ఆస్తులుకి రక్షణ ఉండాలి… ఇంతకు ముందు చేసిన అప్పుల మాటేమిటి… ఎలా తీరుస్తారు… పథకాలు డబ్బు ఎలా తెస్తారు.? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి వీటికి ఎవరు సమాధానం చెపుతారో చూడాలి.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







