'లాంఛ్ ఆఫర్'ని ప్రకటించిన జెట్ ఎయిర్వేస్
- March 07, 2016
ఒమన్ నుంచి ఢిల్లీ మీదుగా భారతదేశంలోని వివిధ నగరాలకు వెళ్ళే ప్రయాణీకుల కోసం జెట్ ఎయిర్ వేస్ 'లాంఛ్ ఆఫర్'ని ప్రకటించింది. ఈ ఆఫర్ ఏంటంటే, ప్రయాణీకులు మార్చ్ 6 నుంచి 12 మధ్యలో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి టిక్కెట్ ధరలో 15 శాతం రాయితీ ఇవ్వనున్నారు. 31 మే వరకు ప్రయాణించేవారి కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ జనరల్ మేనేజర్ రియాజ్ కుట్టెరి మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇండియాకి చెందిన ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్ మొత్తం 73 డెస్టినేషన్స్కి విమానాలు నడుపుతోంది. ఇందులో 51 భారతదేశంలోనివి కాగా, 22 ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. 116 ఎయిర్ క్రాఫ్ట్లను జెట్ ఎయిర్ వేస్ వినియోగిస్తోంది. వీటిల్లో బోయింగ్ 777-300 ఇర్, ఎయిర్ బస్ ఎ330-200/300, నెక్స్ట్ జనరేషన్ బోయింగ్ 737 మరియు ఎటిఆర్ 72-500/600 వంటివి ఉన్నాయి. జెట్ ఎయిర్ వేస్ ప్రకటించిన 15 శాతం డిస్కౌంట్ ఆఫర్ వినియోగించుకోవడానికి జెట్ ఎయిర్ వేస్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







