దుబాయ్: ఫార్మసీ దోపిడి కేసులో ముగ్గురికి జైలుశిక్ష
- June 12, 2021
దుబాయ్: ఓ ఫార్మసీలో దోపిడికి పాల్పడిన ముగ్గురు సభ్యుల ఆసియా గ్యాంగ్ కు జైలు శిక్ష పడింది. నేరం నిర్ధారణ కావటంతో ముగ్గురికి ఏడాది జైలుశిక్ష, Dhs4,000 జరిమానాతో పాటు శిక్షా కాలం ముగిసిన తర్వాత వారిపై దేశబహిష్కరణ అమలు చేయాలని దుబాయ్ కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది మార్చిలో దుబాయ్ లోని రిక్కి ప్రాంతంలో దోషులు దోపిడికి పాల్పడ్డారు. తాను ఫార్మసీలో విధులు నిర్వహిస్తుండగా ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు మొదటి షాపులోకి వచ్చి మందులు కొన్నారని బాధితుడు కోర్టుకు తెలిపాడు. తాను మందులు ఇచ్చి డబ్బులు క్యాష్ బాక్స్ డ్రాలో వేస్తున్న సమయంలో ఇద్దరిలో ఓ వ్యక్తి కత్తితో తనను బెదిరించాడని, మరో వ్యక్తి తనపై కారం చల్లాడని, అంతలోనే మూడో వ్యక్తి కూడా ఫార్మసీలోకి దూసుకొచ్చి దోపిడి పాల్పడ్డాడని వివరించాడు. తాను ఎదురు తిరిగినా, తన భుజంపై కత్తితో దాడి చేసి క్యాష్ బాక్స్ డ్రాలో నుంచి Dhs4,000 డబ్బు దోచుకెళ్లినట్లు కోర్టుకు తెలిపాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు చేసిన పోలీసులు ఆసియా గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావటంతో దుబాయ్ కోర్టు దోషులకు శిక్షలు ఖరారు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









