ఈ నెల 18న వైద్యుల దేశవ్యాప్త నిరసన: ఐఎంఏ
- June 12, 2021
ప్రాణదాతల రక్షణ బాధ్యత కేంద్రానిదేనన్న భారత వైద్యమండలి
న్యూ ఢిల్లీ: బిహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ‘సేవ్ ది సేవియర్’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న ఆందోళన చేపట్టనున్నట్టు ఐఎంఏ వెల్లడించింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నల్లటి వస్త్రాలు, మాస్కులు, బ్యాడ్జీలను ధరించి నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆ రోజు ఆసుపత్రులు పని చేస్తాయని తెలిపింది. వైద్యులు సహా ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల నియంత్రణకు కఠిన చట్టాలను రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రాణదాతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై జరిగిన అమానుష దాడుల గురించి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తిలో వైరస్ సోకి దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐఎంఏ వెల్లడించింది. బిహార్లోనే ఎక్కువ మంది మృతి చెందినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









