ఇల్లిగల్ గ్యాదరింగ్స్ పై చర్యలు తీసుకున్న బహ్రెయిన్ అధికారులు

- June 12, 2021 , by Maagulf
ఇల్లిగల్ గ్యాదరింగ్స్ పై చర్యలు తీసుకున్న బహ్రెయిన్ అధికారులు

బహ్రెయిన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పబ్లిక్ గ్యాదరింగ్ పై ఆంక్షలు విధించిన బహ్రెయిన్...నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టింది. కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్..జనం గుమికూడటంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ తో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో మరణించిన హుస్సేన్ అహ్మద్ ఇసా బరాకత్ అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లటంతో టాస్క్ ఫోర్స్ ఆదేశాలకు విరుద్ధంగా పబ్లిక్ గ్యాదరింగ్ చట్టవిరుద్ధమన్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో అందుకు భిన్నంగా వ్యవహరించి సమాజ ద్రోహానికి పాల్పడొద్దని అధికారులు పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com