ఇల్లిగల్ గ్యాదరింగ్స్ పై చర్యలు తీసుకున్న బహ్రెయిన్ అధికారులు
- June 12, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పబ్లిక్ గ్యాదరింగ్ పై ఆంక్షలు విధించిన బహ్రెయిన్...నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టింది. కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్..జనం గుమికూడటంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ తో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో మరణించిన హుస్సేన్ అహ్మద్ ఇసా బరాకత్ అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లటంతో టాస్క్ ఫోర్స్ ఆదేశాలకు విరుద్ధంగా పబ్లిక్ గ్యాదరింగ్ చట్టవిరుద్ధమన్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో అందుకు భిన్నంగా వ్యవహరించి సమాజ ద్రోహానికి పాల్పడొద్దని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







