చైనా: గ్యాస్ పేలుడు ఘటనలో 11 మంది మృతి
- June 13, 2021
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.సెంట్రల్ చైనాలోని హుబేయి ప్రావిన్స్లో భారీ గ్యాస్ పేలుడు సంభవించడంతో 11 మంది మరణించగా...37మంది తీవ్రగా గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటన ఆదివారం ఉదయం 6.30 షియాన్ సిటీలోని జంగ్వాన్ జిల్లాలో జరిగింది. స్థానిక మార్కెట్పై ఈ పేలుడు తీవ్ర ప్రభావాన్ని చూపిందని సిజిటిఎన్-టివి పేర్కొంది. అనేక మంది నివాసితులు అల్పాహారం చేసేందుకు, కూరగాయలకు మార్కెట్లో కొనుగోలు చేసేందుకు తరచూ ఇక్కడకు వస్తారని పేర్కొంది.ఈ పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని భావించి అధికారులు సహాయక చర్యలు చేపట్టారని పేర్కొంది. మొత్తంగా మృతులతో సహా 144 మందిని వెలికి తీశారని సమాచారం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









