తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల పై ఆంక్షలు ఎత్తివేత
- June 14, 2021న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గతంలో తెలంగాణ, ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. రోడ్డు, రైలు, విమానం ఇలా ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు RT-PCR నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6న కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్లతోపాటు ఆయా విభాగాలకు ఆదేశాలు ఇచ్చింది.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరించుకుంది. వాటితోపాటు నెగిటివ్ రిపోర్ట్ లేకుంటే 14 రోజుల క్వారంటైన్ ఉండాలనే నిబంధనను కూడా సడలించింది. దీంతో ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే ప్రయాణికులు సాధారణ ప్రయాణాలు చేయడానికి సులభతరం అయింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ