ఆన్ లైన్ మోసాల పై ఖాతాదారులకు SBI హెచ్చరిక..
- June 14, 2021
ముంబై: ఆన్ లైన్ మోసాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది. ఖాతాదారులు మోగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఆన్లైన్లో ఎటువంటి సున్నితమైన వివరాలను ఎవ్వరితోను పంచుకోవద్దని హెచ్చరించింది. నెట్బ్యాంకింగ్కు సంబంధించిన పాస్వర్డ్లు, డేటాప్బర్త్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ గానీ, పాస్వర్డ్, ఏటీఎం నెంబర్, బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు పిన్ నెంబర్, సీవీవీ, ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని, లేకపోతే నిలువునా మోసపోవాల్సి ఉంటుందని ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది. అలాగే ఎవరైనా ఎస్బీఐ నుంచి ఫోన్లు చేస్తూ మీ బ్యాంకు వివరాలు, డెబిట్ కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవదని తెలిపింది.
ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న దృష్ట్యా ఖాతాదార్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఎస్బీఐ. అయితే చాలా మంది బ్యాంక్ లావాదేవీలు, బ్యాంకులకు సంబంధించి ఇతర పనులు ఎక్కువ మంది మొబైల్లో ఆన్లైన్ ద్వారానే చేసుకుంటున్నారు.ఇలాంటి వారిని ఆసరా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు.ఇప్పటికే ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఇలాంటి నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి నిఘానే పెట్టారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







