అమెరికా దాడి : 150 ఉగ్రవాదుల హతం
- March 07, 2016నిన్నమొన్నటివరకు ఐఎస్ఐఎస్ టార్గెట్ గా ఇరాక్, సిరియాల్లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపిన అమెరికా వైమానిక దళం.. చాలా కాలం తర్వాత ఆఫ్రికా గడ్డపై బాంబులు విసిరింది. వరుస దాడులతో సోమాలియాను వణికిస్తోన్న అల్ షబాబ్(అల్ కాయిదా అనుబంధ సంస్థ) సంస్థపై దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ ట్రైనింగ్ క్యాంప్ ను లక్ష్యంగా చేసుకుని శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో దాదాపు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షక బలగాలపై దాడులకు పాల్పడేలా 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తుందన్న సమాచారం అందటంతో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాడులు నిర్వహించామని, చనిపోయిన వారంతా ఉగ్రవాదులేనని, సాధారణ పౌరులెవ్వరు లేరని పెంటగాన్ అధికారి డేవిడ్ పేర్కొన్నారు.ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆఫ్రికన్ యూనియన్ శాంతి బలగాలతోపాటు విదేశీయులే లక్ష్యంగా దాడులు జరిపేందుకు అల్ షబాబ్ కుట్రపన్నిందని, రెండు నెలల కిందట రాజధాని నగరం మొగదిషులోని ఓ హోటల్ పై దాడి కూడా ఆ సంస్థపనేనని డేవిడ్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్ బలగాల ధాటికి 2011లో మొగదిషును నుంచి తోకముడిచిన ఉగ్రవాదులు ఇటీవల మళ్లీ విజృంభిస్తుండటంతో సోమాలియాలో రక్తపుటేరులు పారుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలోనేకాక కెన్యా, ఉగాండాల్లోనూ అల్ షబాబ్ కు జిహాదీలున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం