హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్
- March 07, 2016
దేశంలో అలజడి సృష్టించి పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు అందడంతో హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్ కొనసాగుతున్నది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి గుజరాత్లోకి 10 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘావర్గాలు తెలుపడంతో రాష్ర్టాల్లో కేంద్ర హోంశాఖ రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. లష్కరే తాయిబాతో కలిసి జైషే మహమ్మద్ భారత్లో బాంబు పేలుళ్లకు పథకం రూపొందించిందని మొదటిసారిగా పాక్ భద్రతా సలహాదారులు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించారు. దీనితో దేశంలోని మెట్రోనగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పుణెలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయ రాష్ర్టాల పోలీస్ శాఖలను ఐబీ హెచ్చరించింది.ఈనేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై హైదరాబాద్లో పలుచోట్ల వాహనాలతనిఖీలు, సోదాలు నిర్వహించారు. మెట్రోనగరాల్లోని రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు,ఎయిర్పోర్టులు, కేంద్ర కార్యాలయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని హోంశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నాకాబందీ నిర్వహించడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









