హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్
- March 07, 2016
దేశంలో అలజడి సృష్టించి పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు అందడంతో హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్ కొనసాగుతున్నది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి గుజరాత్లోకి 10 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘావర్గాలు తెలుపడంతో రాష్ర్టాల్లో కేంద్ర హోంశాఖ రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. లష్కరే తాయిబాతో కలిసి జైషే మహమ్మద్ భారత్లో బాంబు పేలుళ్లకు పథకం రూపొందించిందని మొదటిసారిగా పాక్ భద్రతా సలహాదారులు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించారు. దీనితో దేశంలోని మెట్రోనగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పుణెలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయ రాష్ర్టాల పోలీస్ శాఖలను ఐబీ హెచ్చరించింది.ఈనేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై హైదరాబాద్లో పలుచోట్ల వాహనాలతనిఖీలు, సోదాలు నిర్వహించారు. మెట్రోనగరాల్లోని రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు,ఎయిర్పోర్టులు, కేంద్ర కార్యాలయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని హోంశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నాకాబందీ నిర్వహించడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







