హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్
- March 07, 2016దేశంలో అలజడి సృష్టించి పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు అందడంతో హైదరాబాద్ మహానగరంలో హైఅలర్ట్ కొనసాగుతున్నది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి గుజరాత్లోకి 10 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘావర్గాలు తెలుపడంతో రాష్ర్టాల్లో కేంద్ర హోంశాఖ రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. లష్కరే తాయిబాతో కలిసి జైషే మహమ్మద్ భారత్లో బాంబు పేలుళ్లకు పథకం రూపొందించిందని మొదటిసారిగా పాక్ భద్రతా సలహాదారులు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించారు. దీనితో దేశంలోని మెట్రోనగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పుణెలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయ రాష్ర్టాల పోలీస్ శాఖలను ఐబీ హెచ్చరించింది.ఈనేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై హైదరాబాద్లో పలుచోట్ల వాహనాలతనిఖీలు, సోదాలు నిర్వహించారు. మెట్రోనగరాల్లోని రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు,ఎయిర్పోర్టులు, కేంద్ర కార్యాలయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని హోంశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నాకాబందీ నిర్వహించడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం