ఇరాన్ కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్

- June 18, 2021 , by Maagulf
ఇరాన్ కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్

టెహ్రాన్: ప్రెసిడెంట్ ఎన్నిక ఇరాన్ దేశంలో జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తున్నారు. జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసి ఈ పోటీలో ముందంజలో వున్నట్లు పలు మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మాజీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అబ్దోల్ నాజర్ హెమ్మాతి కూడా రేసులో గట్టిగానే పోటీ పడుతున్నారు. మొత్తం 59 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇరాన్ జనాభా 80 మిలియన్లకు పైనే. కాగా, ఇరానియన్ స్టూడెంట్ పోలింగ్ ఏజెన్సీ అంచనా ప్రకారం 42 శాతం మంది మాత్రమే ఓట్లు వేసే అవకాశం వుందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com