మనీ లాండరింగ్: ఇద్దరికి జైలు శిక్ష
- June 18, 2021
మనామా: హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మనీ లాండరింగ్ అభియోగాల నేపథ్యంలో మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే నిందితులకు 5,000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా విధించడం జరిగింది. మొదటి నిందితుడి నుంచి 20,000 బహ్రెయినీ దినార్లు, రెండో నిందితుడి నుంచి 10,000 బహ్రెయినీ దినార్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం. అక్రమ మార్గం ద్వారా నిందితులు మనీ లాండరింగ్ చేశారని ఫైనాన్షియల్ క్రైమ్స్ మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ హెడ్ తెలిపారు. ఇద్దరు నిందితులు చేపట్టిన మనీ లాండరింగ్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. విచారణలో దొరికిన ఆధారాల నేపథ్యంలో నిందితులకు శిక్షలు ఖరారు చేసింది న్యాయస్థానం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,మనామా)
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









