మనీ లాండరింగ్: ఇద్దరికి జైలు శిక్ష
- June 18, 2021
మనామా: హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మనీ లాండరింగ్ అభియోగాల నేపథ్యంలో మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే నిందితులకు 5,000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా విధించడం జరిగింది. మొదటి నిందితుడి నుంచి 20,000 బహ్రెయినీ దినార్లు, రెండో నిందితుడి నుంచి 10,000 బహ్రెయినీ దినార్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం. అక్రమ మార్గం ద్వారా నిందితులు మనీ లాండరింగ్ చేశారని ఫైనాన్షియల్ క్రైమ్స్ మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ హెడ్ తెలిపారు. ఇద్దరు నిందితులు చేపట్టిన మనీ లాండరింగ్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. విచారణలో దొరికిన ఆధారాల నేపథ్యంలో నిందితులకు శిక్షలు ఖరారు చేసింది న్యాయస్థానం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,మనామా)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







