అపాయింట్మెంట్ ఉంటేనే 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్
- June 18, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే గవర్నమెంట్ సెంటర్స్ కు వెళ్లాలని ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెకండ్ ప్యాకేజీలో భాగంగా 45 ఏళ్లు అంతకుపైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..సెకండ్ ప్యాకేజీలో భాగంగా వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు మొబైల్ యాప్ తారాసూద్ ద్వారాగానీ లేదంటే వెబ్ సైట్ https://t.co/XK0z3FxGuZ?amp=1 లింక్ ద్వారాగానీ సుల్తానేట్లోని పలు గవర్నరేట్లలో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇదిలాఉంటే ఫస్ట్ ప్యాకేజీలో భాగంగా ఎంపిక చేసిన ప్రాధాన్య వర్గాల వారు పెద్ద సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్ పొందారని ఆరోగ్య శాఖ వివరించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం వారు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









