వ్యాక్సిన్ పొంది ముంబై చేరుకునే వారికి నో క్వారంటైన్

- June 19, 2021 , by Maagulf
వ్యాక్సిన్ పొంది ముంబై చేరుకునే వారికి నో క్వారంటైన్

ముంబై: రెండు డోసలు వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఎయిర్ ఎయిండియా ఎక్స్ ప్రెస్ మరో ఊరట కలిగించే ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఇండియన్ నేషనల్ క్యారియర్ ద్వారా ముంబై చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే..ఇది నేరుగా ముంబై చేరుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. టాన్సిట్ ప్రయాణికులకు ఈ మినహాయింపు ఉండదు. క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందేందుకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ఇతర ఎయిర్ లైన్స్ లో ముంబై చేరుకునే వారు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం పాటు తమ సొంత ఖర్చుతో ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. మరో వారం తగిన జాగ్రత్తలతో హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com