భారత్ కరోనా అప్డేట్

- June 19, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌తంలో నాలుగు లక్ష‌ల‌కు పైగా న‌మోద‌వ్వ‌గా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ల‌క్ష‌కు దిగువగా వస్తున్నాయి. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 60,753 కేసులు న‌మోద‌య్యాయి.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది.ఇందులో 2,86,78,390 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 1,647 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,85,137కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో 97,743 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com