ఆగస్ట్ 31 వరకు ప్రవాసీయుల క్షమాభిక్ష గడువు పెంపు
- June 19, 2021
ఒమన్: ఒమన్ లో ఉంటున్న ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆగస్ట్ 31లోగా దేశం విడిచి వెళ్లిన వారికి ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉండవని తెలిపింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలో ఉంటున్న ప్రవాసీయులు ఈ క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో గానీ, సనద్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







