ఆగస్ట్ 31 వరకు ప్రవాసీయుల క్షమాభిక్ష గడువు పెంపు
- June 19, 2021
ఒమన్: ఒమన్ లో ఉంటున్న ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆగస్ట్ 31లోగా దేశం విడిచి వెళ్లిన వారికి ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉండవని తెలిపింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలో ఉంటున్న ప్రవాసీయులు ఈ క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో గానీ, సనద్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









