ఆగస్ట్ 31 వరకు ప్రవాసీయుల క్షమాభిక్ష గడువు పెంపు

- June 19, 2021 , by Maagulf
ఆగస్ట్ 31 వరకు ప్రవాసీయుల క్షమాభిక్ష గడువు పెంపు

ఒమన్: ఒమన్ లో ఉంటున్న ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆగస్ట్ 31లోగా దేశం విడిచి వెళ్లిన వారికి ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉండవని తెలిపింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలో ఉంటున్న ప్రవాసీయులు ఈ క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో గానీ, సనద్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com