తెలంగాణ: జులై 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం
- June 19, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగం చిన్నాభిన్నం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కరోనా వల్ల చాలా నష్ట పోయారు. అటు థర్డ్ వేవ్ కూడా పిల్లలపై ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో.. తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జూలై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలు ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులు, సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ పలు సూచనలు చేసింది. కాగా తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. లాగ్ డౌన్ ఎత్తి వేసినంత మాత్రాన కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని.. మాస్కులు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది.
తాజా వార్తలు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా









