భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- February 05, 2026
దుబాయ్: అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన భారతీయ విద్యావేత్త, కళాకారిణి మరియు సామాజిక నూతనతావాది రౌబుల్ నాగీకి ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ డాలర్లు 10 లక్షల (US $1 మిలియన్) విలువైన జెమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ లభించింది.
దుబాయ్లో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్ వేదికపై దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ అవార్డును అందజేశారు.
ఈ ఏడాది 139 దేశాల నుంచి వచ్చిన 5,000కుపైగా నామినేషన్లు మరియు దరఖాస్తులలో నుంచి రౌబుల్ నాగీని విజేతగా ఎంపిక చేశారు. సమిట్ చివరి రోజున ఈ ప్రకటన చేయగా, జెమ్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ మరియు వర్కీ ఫౌండేషన్ ప్రతినిధుల సమక్షంలో అవార్డును అందజేశారు.
ఇరవై ఆరు సంవత్సరాల క్రితం, తన ఆర్ట్ వర్క్షాప్లలో ఒకదానిలో ఇండియన్ టీచర్ రూబుల్ నాగి తన జీవితాన్ని పూర్తిగా మార్చిన ఒక చిన్నారిను కలిశారు. “అతను ఇంతకు ముందు ఎప్పుడూ పెన్సిల్ను కూడా చూడలేదు,” అని ఆమె ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2026 సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు విద్య, సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసం అందించేందుకు ఆమె చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వేలాది మంది అభ్యర్థులలోంచి ఎంపికైన రూబుల్ నాగి, కళను సాధనంగా ఉపయోగించి పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తన సంకల్పాన్ని మరింత బలపరిచారు.
ఈ అవార్డు ఆమె చేసిన సేవలకు మాత్రమే కాకుండా, విద్య ద్వారా సమాజాన్ని మారుస్తామనే నమ్మకానికి కూడా గౌరవంగా నిలిచింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







