ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- February 05, 2026
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలు కుట్రతోనే ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు.అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని ప్రధానికి సలహా ఇచ్చానని చెప్పారు.దీంతో ప్రసంగాన్ని మోదీ రద్దు చేసుకున్నారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని మోదీ లోక్సభలో బుధవారం ప్రసంగించాల్సి ఉన్నది. అయితే దీనికి ముందు సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు ప్రధాని సీటు ముందు నిల్చొని నిరసన తెలిపారు.ఈ గందరగోళం నేపథ్యంలో లోక్సభ వాయిదా పడింది.
కాగా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)ఈ సంఘటనపై సభలో గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు తన చైర్ను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. ప్రధాని ప్రసంగ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించవచ్చని తనకు ముందే సమాచారం ఉన్నట్లు తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు ప్రధానమంత్రి సీటు వద్దకు వెళ్లి ఊహించని సంఘటనకు పాల్పడవచ్చని నాకు విశ్వసనీయ సమాచారం అందింది. అలాంటి సంఘటన జరిగి ఉంటే, అది దేశ గౌరవానికి తీవ్ర నష్టం కలిగించి ఉండేది. అందుకే ప్రధానమంత్రిని పార్లమెంటుకు రావద్దని నేను కోరా’ అని అన్నారు. మరోవైపు రాజకీయ విభేదాలను స్పీకర్ కార్యాలయం వరకు తీసుకురావడం ఈ సభ సంప్రదాయం కాదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్సభలో బుధవారం జరిగిన సంఘటన పార్లమెంటు చరిత్రలో ఒక మాయని మచ్చ అని అన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







