ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- February 05, 2026
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలు కుట్రతోనే ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు.అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని ప్రధానికి సలహా ఇచ్చానని చెప్పారు.దీంతో ప్రసంగాన్ని మోదీ రద్దు చేసుకున్నారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని మోదీ లోక్సభలో బుధవారం ప్రసంగించాల్సి ఉన్నది. అయితే దీనికి ముందు సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు ప్రధాని సీటు ముందు నిల్చొని నిరసన తెలిపారు.ఈ గందరగోళం నేపథ్యంలో లోక్సభ వాయిదా పడింది.
కాగా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)ఈ సంఘటనపై సభలో గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు తన చైర్ను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. ప్రధాని ప్రసంగ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించవచ్చని తనకు ముందే సమాచారం ఉన్నట్లు తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు ప్రధానమంత్రి సీటు వద్దకు వెళ్లి ఊహించని సంఘటనకు పాల్పడవచ్చని నాకు విశ్వసనీయ సమాచారం అందింది. అలాంటి సంఘటన జరిగి ఉంటే, అది దేశ గౌరవానికి తీవ్ర నష్టం కలిగించి ఉండేది. అందుకే ప్రధానమంత్రిని పార్లమెంటుకు రావద్దని నేను కోరా’ అని అన్నారు. మరోవైపు రాజకీయ విభేదాలను స్పీకర్ కార్యాలయం వరకు తీసుకురావడం ఈ సభ సంప్రదాయం కాదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్సభలో బుధవారం జరిగిన సంఘటన పార్లమెంటు చరిత్రలో ఒక మాయని మచ్చ అని అన్నారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







