హైదరాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 21, 2021హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్యాసింజర్ టెర్మినల్ భవనంలోని ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మందికి పైగా ప్రయాణికులు, విమానాశ్రయ ఉద్యోగులు మరియు సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు గంట పాటు యోగా సెషన్ కొనసాగింది. హార్ట్ఫుల్ నెస్కు చెందిన యోగా శిక్షకురాలు నీలిమ పర్యవేక్షణలో దీనిని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యోగా యొక్క ప్రయోజనాలను వివరించి, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రాణాయం, సూక్ష్మ వ్యాయామ వంటి వివిధ ఆసనాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో విమానాశ్రయ సిబ్బంది, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమాన్ని సరైన భౌతిక దూరంతో నిర్వహించారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ఒత్తిడిని తెచ్చింది. ఇలాంటి సమయంలో యోగా సాధన వల్ల రోగనిరోధక శక్తి, పాజిటివిటీ పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది. నేడు ప్రపంచమంతటా శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగాను అనుసరిస్తున్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం క్రమం తప్పకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి కారణంగా దానిని రద్దు చేసారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమ ఉద్యోగులు వివిధ యోగా కోర్సులకు హాజరయ్యేలా ప్రోత్సహిస్తుంది, వారి కోసం ఆన్లైన్ సెషన్లు నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు