మరోసారి వాయిదా పడిన స్పుత్నిక్ సెకండ్ డోసు షెడ్యూల్
- June 21, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ సెకండ్ డోస్ కోసం లబ్ధిదారులు మరికొంత కాలం వేచి చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఈపాటికి అందాల్సిన కొత్త బ్యాక్ వ్యాక్సిన్ డోసులు ఇంకా దేశానికి చేరకపోవటంతో సెకండ్ డోస్ షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. దీంతో ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ కోసం రిజిస్టర్ చేసుకున్న వారు మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు స్పుత్నిక్ తయారీ సంస్థ నుంచి తగిన మోతాదులో డోసులు బహ్రెయిన్ కు చేరలేదని అధికారులు వెల్లడించారు. అయినా..తొలి డోస్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు డోసుల మధ్య గడువు పెరిగటం వల్ల కూడా తొలి డోసు సమర్ధత ఇంకా మెరుగుపడుతుందని చెబుతున్నారు. కంపెనీ నుంచి కొత్త బ్యాచ్ వ్యాక్సిన్ డోసులు రాగానే బీఅవేర్ యాప్ ద్వారా సెకండ్ డోస్ సమయాన్ని రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం







