మరోసారి వాయిదా పడిన స్పుత్నిక్ సెకండ్ డోసు షెడ్యూల్
- June 21, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ సెకండ్ డోస్ కోసం లబ్ధిదారులు మరికొంత కాలం వేచి చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఈపాటికి అందాల్సిన కొత్త బ్యాక్ వ్యాక్సిన్ డోసులు ఇంకా దేశానికి చేరకపోవటంతో సెకండ్ డోస్ షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. దీంతో ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ కోసం రిజిస్టర్ చేసుకున్న వారు మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు స్పుత్నిక్ తయారీ సంస్థ నుంచి తగిన మోతాదులో డోసులు బహ్రెయిన్ కు చేరలేదని అధికారులు వెల్లడించారు. అయినా..తొలి డోస్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు డోసుల మధ్య గడువు పెరిగటం వల్ల కూడా తొలి డోసు సమర్ధత ఇంకా మెరుగుపడుతుందని చెబుతున్నారు. కంపెనీ నుంచి కొత్త బ్యాచ్ వ్యాక్సిన్ డోసులు రాగానే బీఅవేర్ యాప్ ద్వారా సెకండ్ డోస్ సమయాన్ని రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







