దైనందిన జీవితంలో భాగంగా యోగా: ఏపీ గవర్నర్

- June 21, 2021 , by Maagulf
దైనందిన జీవితంలో భాగంగా యోగా: ఏపీ గవర్నర్

అమరావతి: అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం రాష్ట్ర ప్రజలకు యోగా దినోత్సవ సందేశాన్ని అందించిన గవర్నర్,  కరోనా నేపథ్యంలో భారతీయ సంప్రదాయ జీవన విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరముందని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు కోవిడ్ -19 కష్టకాలంలో యోగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వైరస్ నుండి రక్షణ కవచాన్ని అందిస్తుందన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఉత్తమమైన మార్గంమని గవర్నర్  బిశ్వ భూషన్ హరిచందన్ వివరించారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com