కువైట్: కోవిడ్ పేషెంట్లలో 60% మంది ప్రవాసీయులే!

- June 23, 2021 , by Maagulf
కువైట్: కోవిడ్ పేషెంట్లలో 60% మంది ప్రవాసీయులే!

కువైట్: కువైట్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని కోవిడ్ సుప్రీమ్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. ప్రస్తుత కోవిడ్ కేసుల్లో 40 శాతం మంది కువైట్ పౌరులని, మిగిలిన 60 శాతం మంది నాన్ కువైతీలేనని తెలిపింది. ఇక ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న వారిలో వ్యాక్సిన్ పొందని వారే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న 98 శాతం మంది వ్యాక్సిన్ పొందని వాళ్లేనని ఫర్వానియా ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ దలాల్ అల్-మాట్రౌక్ వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా కోవిడ్ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com