యూఏఈ గోల్డెన్ వీసా పొందిన తెలంగాణా వాసి

- June 23, 2021 , by Maagulf
యూఏఈ గోల్డెన్ వీసా పొందిన తెలంగాణా వాసి

యూఏఈ: అబుధాబికి చెందిన ప్రవాస భారతీయుడు సయ్యద్ జావీద్ షా గోల్డెన్ వీసా మంజూరు చేసింది యూఏఈ. ఈ గోల్డెన్ వీసా గడువు పదేళ్ల పాటు ఉంటుంది. పలు రంగాల్లో విశేష సేవలు, ప్రత్యేక నైపుణ్యత ఉన్నవారికి గోల్డెన్ వీసా గౌరవం దక్కుతుంది. 2019 నుంచి లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాల మంజూరు అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల సయ్యద్ జావీద్ షా ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. ఆ తర్వాత 2006లో యూఏఈ వచ్చారు. ఈ 15 ఏళ్లలో ఆయన పలు ప్రాజెక్టుల కోసం 30 దేశాలు చుట్టివచ్చారు. తన 15 ఏళ్ల కృషికి గుర్తింపుగా స్పెషల్ టాలెంట్స్ - ఆర్ట్ అండ్ సైన్స్ కేటగిరీ కింద మే 25 న ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ నుండి గోల్డెన్ వీసా పొందారు. గత వారమే షా సతీమణికి కూడా గోల్డెన్ వీసా పొందటం విశేషం. యూఏఈ గోల్డెన్ వీసా పొందటం తనకు, తన కుటుంబానికి సంతోషకరమైన పరిణామమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల కోసం ఆమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లాలని, అయితే..తనకు యూఏఈ బాగా నచ్చటంతో ఇక్కడే స్థిరపడ్డానని షా చెబుతున్నారు. యూఏఈ తనకు రెండో పుట్టినిల్లు అని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com