చైనా పాఠశాలలో అగ్నిప్రమాదం...18మంది మృతి!
- June 25, 2021
చైనా: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని షాంగ్కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. తెల్లవారు జామున కావడంటతో మంటలు పూర్తిగా వ్యాపించే వరకు ఎవరూ గుర్తించకపోవడంతోనే ఇంత భారీస్థాయిలో నష్టం కలిగినట్లు తెలుస్తుంది.
ఇప్పటికి ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందగా మరో 16 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ నెల 13న సెంట్రల్ హుబెయి ప్రావిన్స్లో గ్యాస్ పైప్లైన్ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. భద్రతా నిర్వహణ లోపాలుతోనే ఆ ప్రమాదం జరగడంతో ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







